జైపూర్: దేశవాళీ వన్డే ట్రోఫీ విజయ్ హజారే టోర్నీలో సౌరాష్ట్ర, సర్వీసెస్ జట్లు సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో సౌరాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించగా.. సర్వీసెస్ జట్టు కూడా ఏడు వికెట్ల తేడా తో కేరళపై నెగ్గి సెమీస్లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కేరళ 40.4 ఓవర్లలో 175 పరుగులు చేసి ఆలౌటైంది. రోహన్ (85; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ స్కోరర్ చేయగా.. మనోహరన్ (41) రాణించాడు. సర్వీసెస్ తరఫున దివేశ్ పఠానియా మూడు వికెట్లు, అభిషేక్, నారంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన సర్వీసెస్ 30.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రవి చౌహాన్ (95) టాప్ స్కోర ర్ కాగా, రజత్ పాలివల్ (65) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడా డు. ఉన్నికృష్ణన్ రెండు వికెట్లు తీశాడు. సెమీస్లో సర్వీసెస్ హిమాచల్ప్రదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది.
సౌరాష్ట్ర ఘన విజయం
మూడో క్వార్టర్స్లో సౌరాష్ట్ర సమిష్టి ప్రదర్శనతో విదర్భపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన విదర్భ 40.3 ఓవర్లకు 150 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. అపూర్వ్ వాంఖడే (72) టాప్ స్కోరర్. సౌరాష్ట్ర తరఫున చేతన్ సఖారియా నాలుగు వికెట్లు పడగొట్టగా.. ధర్మేంద్రసిన్హ్ జడేజా రెండు వికెట్లు తీశాడు. బౌలింగ్లో మెరిసిన సౌరాష్ట్ర బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. 29.5 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ప్రేరక్ మన్కడ్ (77) అర్ధసెంచరీతో విజృంభించగా, అర్పిత్ (41) రాణించాడు. సౌరాష్ట్ర తరఫున ఆదిత్య ఠాక్రే రెండు వికెట్లు తీశాడు. శుక్రవారం జరిగే సెమీస్లో తమిళనాడుతో సౌరాష్ట్ర, హిమాచల్ప్రదేశ్తో సర్వీసెస్ జట్లు తలపడుతాయి.