న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో జట్టు రూపం సంతరించుకుంటున్నది. ఐపీఎల్ మెగా వేలం లోపు సహాయ సిబ్బందిని నియమించుకోవడంపై దృష్టి సారించింది. మెంటార్గా ఎంపీ గౌతమ్ గంభీర్ను.. ప్రధాన కోచ్గా ఆండీ ఫ్లవర్ను నియమించుకున్న ఈ ఫ్రాంచైజీ సహాయ కోచ్గా భారత మాజీ ఆటగాడు విజయ్ దహియాను ఎంపిక చేసుకుంది. హర్యానాకు చెందిన విజయ్.. భారత్ తరఫున రెండు టెస్టులు, 19 వన్డేలు ఆడాడు. గతంలో కోల్కతా నైట్రైడర్స్కు సహాయ కోచ్గా వ్యవహరించాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ రంజీ జట్లకు కూడా పని చేశాడు. లక్నో ఫ్రాంచైజీలో గొప్ప అవకాశమని దక్కిందని.. తాను గౌరవంగా భావిస్తున్నట్లు విజయ్ దహియా తెలిపాడు. లక్నో ఫ్రాంచైజీని ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే.