Vigilence Attacks in AP | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావం పేరుతో ఏపీలో వ్యాపారులు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారు. వివిధ రకాల వంట నూనెల ధరలు పెంచేశారు. యుద్ధం పేరుతో భారీగా గోదాముల్లో నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించారు. రిటైల్ బిజినెస్లో ధరలు పెంచేయడంతో ఆదివారం విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ దుకాణాల్లో సోదాలు జరిపారు.
ఏపీ రాజధాని అమరావతితోపాటు గుంటూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు తదితర జిల్లాల్లో రిటైల్ మొదలు హోల్సేల్ ఆయిల్ దుకాణాలపై దాడులు చేశారు. మాల్స్, షాప్లు, గోదాముల్లో తనిఖీలు జరిపారు. ఆయా దుకాణాల్లో వంట నూనెలు, నిత్యావసర వస్తువుల నిల్వలను పరిశీలించారు.