న్యూఢిల్లీ : నేషనల్ పార్క్లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్తో టైగర్ను వెంటాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనిపై ఇంటర్నెట్ మండిపడుతోంది. ఈ వైరల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు. 8 సెకండ్ల వ్యవధి కలిగిన షార్ట్ క్లిప్లో జంగిల్ సఫారీ సందర్భంగా చేతిలో ఫోన్తో ఓ వ్యక్తి టైగర్ వెంటపడటం కనిపిస్తుంది.
This is going viral. For all the wrong reasons. Tiger tourism sustains local livelihoods & helps in the cause of conservation. Such acts of few morons are giving it a bad name. Please desist from such foolhardy acts & ask ur friends to be sensible during wildlife safari’s. pic.twitter.com/jzUxd1oc6V
— Susanta Nanda IFS (@susantananda3) January 5, 2023
జీప్ నుంచి మరికొందరు టూరిస్టులు పులిని తమ మొబైల్ ఫోన్ కెమెరాల్లో బంధించడం కనిపిస్తుంది. టైగర్ టూరిజం స్ధానికులకు జీవనోపాధిని కల్పించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడుతుంది. కొందరి మూర్ఖత్వంతో దీనికి చెడ్డపేరు వస్తుంది. ఇలాంటి పనులకు దూరంగా ఉండండి..వైల్డ్లైఫ్ సఫారీల్లో సంయమనంతో తెలివితో వ్యవహరించాలని మీ స్నేహితులకూ చెప్పండని ఈ పోస్ట్కు సుశాంత నంద క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 17,000కుపైగా వ్యూస్ లభించాయి. ఈ పోస్ట్పై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పలువురు యూజర్లు కోరారు.