న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి వచ్చే నెలలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నారు. లార్డ్స్లో ఇంగ్లండ్తో జరగనున్న ఫేర్వెల్ మ్యాచ్లో ఆమె ఆడనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఆ మ్యాచ్ జరగనున్నది. ఇటీవల వన్డే వరల్డ్ కప్ సమయంలో ఆమెకు రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన శ్రీలంక వన్డే సిరీస్లో ఆమె ఆడలేదు. అయితే ఇంగ్లండ్ టూర్కు శుక్రవారం ప్రకటించిన జట్టులో ఆమె పేరు ఉంది. మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జులన్ నిలవనున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె ఖాతాలో 352 వికెట్లు ఉన్నాయి. ఈ మధ్యే జులన్ గోస్వామితో చాన్నాళ్లు క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.