రాజన్నసిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం హుండీని మంగళవారం ఆలయ సిబ్బంది ఓపెన్ స్లాబ్పై లెక్కించారు.
17 రోజులకుగాను రూ. కోటి 51 లక్షల 30 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ తెలిపారు. 214 గ్రాముల బంగారం 14 కిలోల వెండి కానుకలను సైతం భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.
హుండీ లెక్కింపునకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ డీ కృష్ణ ప్రసాద్, ఏఈవో హరి కిషన్, ఉద్యోగులు, శివశక్తి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.