హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ రావును ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. అదేవిధంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. వీరందరికి కేబినెట్ హోదా కల్పించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నవారిని తొలగించింది. అసలు సలహాదారుల వ్యవస్తే నిరూపయోగమని, ఖర్చుతో కూడుకున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వస్తున్నారు. అయితే తాజాగా తనకు అత్యంత సన్నితంగా ఉన్న ముగ్గురిని ప్రభుత్వ సలహదారులుగా నియమించుకోవడం విశేషం.