కరీంనగర్ : కరోనా కాటుకు ఓ పోలీసు బలయ్యాడు. జిల్లాలోని వీణవంక పోలీస్ స్టేషన్లో ఏఎస్గా విధులు నిర్వహిస్తున్న గాదర్ల యాదగిరి (56) శివరాత్రి బందోబస్తు విధుల్లో భాగంగా ఈ నెల 8న వేములవాడకు వెళ్లాడు. 12 వతేదీన ఇంటికి తిరిగివచ్చాడు. ఆయాసంగా అనిపించడంతో 13న కరీంనగర్లోని అపోలో దవాఖానలో చేరి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. 15వ తేదీన సాయంత్రం కరోనా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. వైద్య సిబ్బంది ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం యాదగిరి చెందాడు. ఆయన మృతికి ఎస్ఐ కిరణ్రెడ్డి, ఠాణా సిబ్బంది సంతాపం ప్రకటించారు.