నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారికి గురువారం భక్తులు తంజావూరు వీణను బహూకరించారు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన సరస్వతీ ఉపాసకులు ఉమాపతి బాలాంజనేయ శర్మ జ్ఞాపకార్థం ఆయన సతీమణి జానకీశర్మ, కుటుంబ సభ్యులు అమ్మవారికి రెండు కిలోల మిశ్రమ వెండి తొడుగు కలిగిన తంజావూరు వీణను బహూకరించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందన్నారు.