హైదరాబాద్: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో గాయత్రి రవి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కూడా దేశ రాజధానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గాయత్రి రవి నామినేషన్ దాఖలు చేశారు. అయితే పోటీలో ఎవరు లేకపోవడంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈ నెల 24న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ఆయన సోమవారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.