సికింద్రాబాద్, జనవరి 6: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూ బోయిన్పల్లి పెన్షన్లైన్లోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నుంచి 18 ఏండ్ల పిల్లలు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, ఏఎన్ఎం టీనాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగజ్యోతి, వార్డు పార్టీ అధ్యక్షుడు నర్సింహారావు, వార్డు మైనారిటీ అధ్యక్షుడు హాసీన్ఖాన్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్ట సంజీవయ్యనగర్ కాలనీకి చెందిన ఎం. బాబూరావు సీఎంఆర్ఎఫ్కు ఎమ్మెల్యే సహాయంతో దరఖాస్తు చేసుకోగా రూ.60వేలు మంజూరయ్యాయి.ఆ చెక్కును వారి కుటుంబసభ్యులకు క్యాంపు కార్యాలయంలో జక్కుల మహేశ్వర్రెడ్డి గురువారం అందజేశారు. కార్యక్రమంలో నర్సింహారావు, రాజ్కుమార్, విజయ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.