న్యూఢిల్లీ, అక్టోబర్ 24: విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ భారతదేశ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తైన సందర్భంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఆదివారం మోదీ మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమృత మహోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ దేశభక్తి గేయాల పోటీని నిర్వహిస్తున్నదని చెప్పారు. నవ భారతాన్ని ప్రతిబింబించేలా యువ త పాటలు రాయాలని పిలుపునిచ్చారు. రోమ్లో ఈ నెల 30-31వ తేదీల్లో జరగనున్న 16వ జీ-20 సదస్సు, గ్లాస్గోలో కాప్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 29న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.