డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా కర్ఫ్యూను మరోవారం పొడగించింది. ఈ సందర్భంగా పలు మినహాయింపులు ఇచ్చింది. రాష్ట్రంలో ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు ప్రజలు ఇకపై కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియల్ పేర్కొన్నారు. ఇంతకు ముందు రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల నుంచి.. కొండ ప్రాంత జిల్లాలకు వెళ్లేందుకు ప్రజలు నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు వారంలో ఆరు రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరుచుకోవచ్చని చెప్పింది. అలాగే మంగళవారం నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 50శాతం సామర్థ్యంతో వాటర్ పార్కులను సైతం ప్రారంభిచేందుకు అనుమతి ఇచ్చింది.