UPSC | వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది. 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకూ నిర్వహించే పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకూ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 25న పరీక్స నిర్వహిస్తారు. ఆగస్టు 22 నుంచి ఐదు రోజులు యూపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.
వీటితోపాటు సీబీఐ (డీఎస్పీ), ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ), సీఐఎస్ఎఫ్, ఎన్డీఏ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్, సీడీఎస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామకాల పరీక్షల షెడ్యూల్ ను యూపీపీఎస్సీ తన చార్ట్ లో వెల్లడించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణ తేదీలను వివరించింది.