లక్నో, ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్లో తొలి దశ పోలింగ్ గురువారం ముగిసింది. 60.17 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మినహా పోలింగ్ సాఫీగా జరిగింది. ఘాజియాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకొన్నది. మొదటి దశలో మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 73 మంది మహిళలు.