న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో చీపురు పట్టి ఊడ్చారు. భారతీయ రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, ఐటీతో పాటు ఇతర శాఖల్లో స్వచ్ఛత కార్యక్రమం మొదలైనట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాజకీయాల్లో సేవభావం ముఖ్యమని, ఆ రీతిలో స్వచ్ఛత కూడా ఓ సర్వీస్ అని మంత్రి అన్నారు.