ముంబై: కేంద్ర మంత్రి నారాయణ రాణేకు ముంబై హై కోర్టు జరిమానా విధించింది. జూహూ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ను అక్రమంగా నిర్మించారని, దాన్ని కూల్చివేయాలని కోర్టు ముంబై మున్సిపాల్టీని హైకోర్టు ఆదేశించింది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నియమావళిని ఉల్లంఘించినట్లు మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ ఆర్డీ ధనూకా, కమల్ ఖాతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. రాణే కుటుంబం పెట్టుకున్న రెండవ దరఖాస్తుకు అనుమతి ఇవ్వరాదు అని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ను కోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మాణ ప్రాంతాల్ని రెండు వారాల్లోగా కూల్చివేయాలని కోర్టు పేర్కొన్నది. మంత్రి రాణేకు 10 లక్షల జరిమానా కూడా విధించింది.రెండు వారాల్లోగా ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.