హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా శుద్ధిచేసిన నీటిని అందిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మరోసారి అభినందించారు. శనివారం ఆయన బెంగళూరులో జల్జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్ అమలుపై దక్షిణాది రాష్ట్రాల మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 54 లక్షల కుటుంబాలకు నల్లా నీటిని అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నల్లా నీటి కనెక్షన్ ఉన్నదని వివరించారు.