న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓఫారెల్ను కలిశారు. ఆస్ట్రేలియా- భారత్ సమగ్ర వ్యూహాత్యక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పని చేయడానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు చర్చించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా హై కమిషనర్ను కలువడం సంతోషంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియా – భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కలిసి పని చేసేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అత్యాధునిక పరిశోధన, ఆన్లైన్ విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పాఠశాల విద్యలో పాఠ్య ప్రణాళిక, బోధనా ప్రణాళిక అప్గ్రేడ్ చేయడంలో సహకారాన్ని పెంపొందించేందుకు జాతీయ నూతన విద్యా విధానం-2020 ఇరు దేశాలకు పెద్ద కాన్వాస్ను అందిస్తుందంటూ ట్వీట్ చేశారు.