న్యూఢిల్లీ: నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేశారు. ఆ పరీక్షను 6 నుంచి 8 వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాస్తవానికి మార్చి 12వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే నీట్ పీజీ 2021 కౌన్సింగ్ కూడా అదే సమయంలో జరగనున్న నేపథ్యంలో ఈ యేటి పీజీ పరీక్షను వాయిదా వేయాలని కూడా వినతులు వచ్చాయి.