న్యూఢిల్లీ: భువనేశ్వర్ వేదికగా జరిగే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కోసం హాకీ ఇండియా(హెచ్ఐ) సోమవారం భారత మహిళల హాకీ జట్టును ప్రకటించింది. మొత్తం 22 మంది సభ్యులు కల్గిన భారత బృందానికి గోల్కీపర్ సవిత సారథ్యం వహించనుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సవితకు నాయకత్వ పగ్గాలు అందించారు. ఇటీవల మస్కట్ వేదికగా ఆసియాకప్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత టీమ్ఇండియాకు గోల్కీపర్లుగా సవితతో పాటు రజనీ ఎతిమరుపు, బిచుదేవి ఎంపికయ్యారు. దీంతో పాటు ఐదుగురు ప్లేయర్లను హాకీ ఇండియా స్టాండ్బైగా తీసుకున్నారు.