లాహోర్: ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆరవ టీ20 మ్యాచ్లో అంపైర్ అలీమ్ దార్ గాయపడ్డాడు. పాకిస్థాన్ బ్యాటర్ హైదర్ అలీ కొట్టిన పుల్ షాట్.. లెగ్ అంపైర్ అలీమ్ దార్కు తగలింది. ఈ ఘటన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో చోటుచేసుకున్నది. రిచర్డ్ గ్లీసన్ వేసిన ఆ ఓవర్లో బ్యాటర్ హైదర్ పుల్ షాట్ ఆడాడు. బంతి తనవైపు వస్తున్నట్లు గమనించిన అంపైర్ అలీమ్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బాల్ గట్టిగా ఆయన తొడలకు తగిలింది. బాల్ తాకిన తర్వాత అంపైర్ దార్ నొప్పితో బాధపడ్డాడు. ఇక కీలకమైన ఆరో మ్యాచ్లో పాకిస్థాన్ ఓడింది. తొలుత పాక్ 6 వికెట్లకు 169 రన్స్ చేయగా, ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేధించింది. ఫిల్ సాల్ట్ 41 బంతుల్లో 88 రన్స్ చేశాడు. హేల్స్ 27, మలన్ 26, డక్కెట్26 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ ఈజీగా మ్యాచ్ గెలిచింది.
Ouch! 😬#PAKvENG | #UKSePK pic.twitter.com/DaD6EwSaVV
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022