హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం తీర్మానించింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనిల్ కూర్మాచలంతోపాటు కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్గా అనిల్ కూర్మాచలానికి అవకాశం కలిపించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కార్యవర్గం కృతఙ్ఞతలు తెలిపింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని లండన్ ఇన్చార్జ్ నవీన్ భువనగిరి తెలిపారు. క్షేత్ర స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్తో సమన్వయం చేసుకొంటూ పని చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ కేయూ అధ్యక్షుడు అశోక్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సలహా సంఘం సభ్యులు దొంతుల వెంకట్రెడ్డి, ప్రవీణ్ వీర, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చటం భారత రాజకీయ చరిత్రలో చారిత్ర ఘట్టం. . ఎన్నారైలంతా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతున్నది. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష. కేసీఆర్ నూతన శకానికి నాంది పలికారు.
– అనిల్ కూర్మాచలం, ఎఫ్డీసీ చైర్మన్
దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని గతంలో 52 దేశాల ఎన్నారై ప్రతినిధులు చేసిన తీర్మానం నిజం అవుతున్నందుకు ఆనందంగా ఉన్నది. బీజేపీ ముక్త్ భారత్ నినాదాన్ని అందిపుచ్చుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్తాం.
– మహేశ్ బిగాల, బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్