ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వైరస్ మలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. మార్చి 1న కేంద్ర ప్రభుత్వం 60 ఏండ్లు పైబడినవారితో పాటు పలు వ్యాధులతో బాధపడే 45 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తరించిన సంగతి తెలిసిందే.
మరోవైపు మహారాష్ట్రలో కొవిడ్-19 వైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన నెలకొంది. కేసులు వరుసగా పెరుగుతుండటంతో సెకండ్ వేవ్పై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఏకంగా 13,659 తాజా కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి కట్టడికి నాగపూర్ నగరంలో లాక్డౌన్ విధించారు.