విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నడుమ వచ్చే పోరాటఘట్టాల్ని అమెరికాలో చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ సినిమాలో హైలైట్గా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు మైక్టైసన్. ‘నా పట్ల దయ చూపించినందుకు ధన్యవాదాలు. అందరికి కృతజ్ఞతలు’ అని ఆయన పేర్కొన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అనన్యపాండే, రమ్యకృష్ణ, రోనిత్రాయ్, విష్ణురెడ్డి, అలీ, మకరంద్దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్జోహార్, అపూర్వ మెహతా, దర్శకత్వం: పూరి జగన్నాథ్.