హైదరాబాద్ : మోయినాబాద్లోని వెంకటాపూర్ సమీపంలోని ఈసీ వాగులో ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మోయినాబాద్ మండల పరిధిలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, కామారెడ్డి జిల్లాకు చెందిన మరో యువకుడు ఈసీ వాగులో ఈత కోసం వెళ్లారు. నీటిలో మునిగి ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.