నల్లగొండ : రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ర్ట నిందితులను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సూర్య ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా రాత్రిపూట దోపిడీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. వీరు గురువారం నల్గొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు ఆపి విచారించగా అసలు విషయం బయటపడింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 21 దొంగతనాలకు పాల్పిడినట్లు వారు ఒప్పుకున్నారని చెప్పారు.
కాగా, నిందితుల వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, కేజీ వెండి ఆభరణాలు, ఒక ల్యాబ్ ట్యాప్, రెండు సెల్ ఫోన్స్, మూడు ఇనప రాడ్లు (వీటి విలువ సుమారు 14,20,000) స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.