జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో మంగళవారం వింత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జక్రాన్పల్లికి చెందిన గొరెల కాపరి తొగరి లక్ష్మణ్కు చెందిన మందలోని ఒక గొరెకు రెండుతలల గొరెపిల్ల జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు తలలతో జన్మించిన గొరెపిల్లను చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా మండల ఇన్చార్జి పశువైద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ జన్యుపరమైన లోపంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అలా జన్మించిన జీవాలు ఒకరోజు కంటే ఎక్కువ బతికే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. గ్రామస్తులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని ఆయన పేర్కొన్నారు.