న్యూఢిల్లీ, నవంబర్ 3: ధరల పెరుగుదల, ప్రభుత్వ ఆస్తుల విక్రయం తదితర కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వచ్చే ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రెండు రోజుల సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు నిచ్చింది. కేంద్రం.. జాతీయ ఆస్తులను ప్రైవేటీకరించి కార్పొరేట్ రంగానికి అప్పగిస్తే తలెత్తే పరిస్థితుల గురించి చర్చించేందుకు కార్మిక సంఘాలు ఈ నెల 1న సమావేశమ య్యాయి. జాతీయ మోనిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) విధానంతో ఎదురయ్యే ప్రమాదాలు, దుష్ప్రభావాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించాయి. దీనికి ప్రారంభంగా ఈ నెల 11న ఢిల్లీలో కార్మిక సంఘాల జాతీయస్థాయి భేటీ నిర్వహిస్తామని ప్రకటించాయి.