సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర లిఖించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తుచేసి 2-1 సిరీస్ చేజిక్కించుకుంది. సఫారీ గడ్డపై బంగ్లాకు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. జానెమన్ మలన్ (39) టాప్ స్కోరర్ కాగా.. బంగ్లా బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 5, షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్; 14 ఫోర్లు), లిటన్ దాస్ (48) రాణించడంతో బంగ్లా 26.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసింది. తస్కీన్ అహ్మద్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.