అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పాలన కొనసాగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పన్నుల పేరిట ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా కొత్తకొత్తవాటిపై పన్నులు వేయడం సిగ్గుచేటని అన్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు వేసే పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని పేర్నొన్నారు.
వినాయక చవితి పండుగ సంప్రదాయాలకు తగ్గట్లు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు జరపాలనటం దుర్మార్గమన్నారు. పనికిమాలిన నిబంధనలు పేరిట హిందూమతం మీద జగన్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలపై భారం పడుతు న్న జీవోలు రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ పాలన ఉందని విమర్శించారు.