కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 30: ఉత్తర తెలంగాణ దివ్యక్షేత్రంగా టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కరీంనగర్లో ఏడాదిన్నరలోగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకోసం కరీంనగర్లోని పద్మానగర్లోగల స్థలాన్ని బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్రావు, టీటీడీ హైదరాబా ద్ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ భాసర్రావు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ దీవకొండ దామోదరరావు, ఈఈ నరసింహమూర్తి, స్థపతి రవికాంత్తో కలిసి పరిశీలించారు. ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు అశోక్, సర్వేయర్లు స్థల కొలతలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడు తూ.. సుమారు పది ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఆ శ్రీనివాసుడి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని పేరొన్నారు.