తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరిస్థితులు సాధారణస్థితికి రాగానే ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.