తిరుపతి, జూలై: తిరుమలతిరుపతిదేవస్థానం పరిపాలన భవన సముదాయంలోని ఉద్యానవనాన్ని టీటీడీ ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కల్ప వృక్షం చెట్టు నాటారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాట్లాడారు. అందంగా తయారుచేసి మంచి మొక్కలు నాటారని వారిని అభినందించారు.
అంతకుముందు ఆయన ఎస్ఈ కార్యాలయంలో పూర్తి చేసిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ లు జగదీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, డి ఎఫ్ ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.