హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుడు ప్రొఫెసర్ చింతా సాయిలు సోమవారం పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పదవీకాలం పూర్తికావటంతో ఆయన రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి, కార్యదర్శి అనితారామచంద్రన్, సభ్యులు బండి లింగారెడ్డి, ఎరవెల్లి చంద్రశేఖర్రావు, కారం రవీందర్రెడ్డి, ధన్సింగ్, సుమిత్రానంద్ తనోబా, ఆర్ సత్యానారాయణ, కోట్ల అరుణకుమారి ఆయన్ను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.