హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్సెట్ కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి శనివారం తెలిపారు. తొలి విడుతలో 4,5 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మూడ్రోజులపాటు విరామం తర్వాత మళ్లీ 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎప్సెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్ల చేశాం. ఒక్కో సెంటర్ వద్ద ఆరుగురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఉంచాం. విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. ఆర్టీసీ కూడా అదనపు బస్సులు నడుపుతున్నది. విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోవడం ఉత్తమం. వీలైతే ముందుగానే సెంటర్లకెళ్లి చూసుకోవడం ఉత్తమం.
-వీ బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)