హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న తరుణంలో వైద్యులు ఆయనకు కొవిడ్ పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్గా తేలింది. తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చేరారు.