హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నగరంలో హెచ్ఐసీసీ వేదికగా బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ‘టీఆర్ఎస్ టెక్సెల్ స్టాల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యంత సులభంగా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో స్మార్ట్ ఫోన్లలోనే వీక్షించేందుకు వీలుగా టీఆర్ఎస్ టెక్సెల్ స్టాల్ను ఏర్పాటుచేశారు. పార్టీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం వంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమాచారాన్ని ఎప్పుడైనా,ఎక్కడైనా చూసేలా క్యూఆర్ కోడ్ను రూపొందించినట్టు పార్టీ ప్రతినిధులకు తెలిసేలా ప్లీనరీలో కరపత్రాలను పంపిణీ చేశామని టీఆర్ఎస్ టెక్సెల్ ప్రతినిధులు తెలిపారు. పార్టీ పోస్టర్లు, వీడియోలను వీక్షించేందుకు క్యూఆర్ కోడ్తో విజిటింగ్ కార్డును రూపొందించి ప్లీనరీలో అందజేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతిని రాష్ట్ర ప్రజలకు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు చేరవేస్తూ, పార్టీ నాయకత్వానికి, పార్టీ ప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను సమన్వయ పర్చడంలో టీఆర్ఎస్ టెక్సెల్ స్టాల్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.