మాదాపూర్, కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 21 : మాదాపూర్లోని హైటెక్స్లో ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు, ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సైప్లె చైర్మన్ మా రెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు వి.జగదీశ్వర్గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్, దొడ్ల వెంకటేశ్లు గురువారం సభా ప్రాంగణం వద్ద వేదిక, పార్కింగ్, భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, వాలా హరీశ్ రావు, అశీల శివ, శ్యాం, జ్ఞానేశ్వర్, ఇమ్రాన్, సుదేశ్, రషీద్, ఖాసీం, బుచ్చిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.