టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ మెప్పు పొంది, బీజేపీలో చేరటానికే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాని మోదీని కలిశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఉదయం కేసీఆర్ను పొగుడుతారు.. సాయంత్రం వెళ్లి మోదీని కలుస్తారు.. వాళ్ల వైఖరేంటో వారికే అర్థం కావటంలేదని అన్నారు. వారిద్దరినీ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేశారు. బీసీ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్రెడ్డిపై రాష్ట్రంలోని బీసీలంతా ఊంచుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఉన్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కోటి మాట్లాడుతూ, మూడు రంగులు, ఆరు పార్టీలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ ట్రిపుల్ఆర్ అంటే రెచ్చగొట్టటం, రచ్చచేయటం, రెచ్చిపోవటం అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 4వ ప్లేస్లో ఉందని రేవంత్రెడ్డి చెప్పుకోవటం సిగ్గుచేటని అన్నారు.