హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూడీసీ) చైర్మన్గా రావుల శ్రీధర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్బాగ్లోని సంస్థ కార్యాలయంలో మంత్రులు హరీశ్రావు, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పూజల్లో పాల్గొన్న మంత్రులు.. శ్రీధర్రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, నవీన్ కుమార్, ఎల్ రమణ, కాటేపల్లి జనార్దన్రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు శ్రీధర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.