చౌటుప్పల్/ మేడ్చల్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, రెడ్డిబావిలలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘటన సీఎం కేసీఆర్దేనని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రికి ప్రజలు కానుకగా ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని అన్నారు. మునుగోడును మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు.