ఆస్ట్రేలియా : వరంగల్లో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు సత్యం రావు గురిజపల్లికి మెల్బోర్న్లో టీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము ఓ మిత్రున్ని , గులాబీ సైనుకున్ని కోల్పాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ స్థాపన నుంచి నేటి వరకు తమ సంస్థకు తను చేసిన కృషి గొప్పదన్నారు. సత్యం మృతి వ్యక్తి గతంగా.. పార్టీ పరంగా తమకు తీరని లోటన్నారు. కార్యక్రమంలో విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సనిల్ రెడ్డి, విక్రమ్ కందుల, వినయ్ సన్నీ, సంజీవ రెడ్డి రాయ్ రెడ్డి, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.