న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ అల్వా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్వాకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించింది. మార్గరేట్ అల్వాకు మద్దతునివ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు.