నటి, వ్యాఖ్యాత మరోసారి ట్రోలింగ్కు గురయ్యారు. తన గురించి, తన కుటుంబం గురించి అసభ్యంగా కామెంట్స్ పెట్టే వారిపై పోలీస్ కేసులు పెడతానని ఆమె హెచ్చరించారు. తాజాగా ఆమె ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. ‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కొన్నిసార్లు రావడం ఆలస్యమవచ్చు కానీ రావడం మాత్రం’ పక్కా అంటూ ట్వీట్ చేసింది. ఒక యువ హీరోను ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేసిందని అనుకుంటున్నారు. అనసూయ ట్వీట్ చేసిన వెంటనే సదరు హీరో అభిమానులు ట్రోలింగ్కు దిగారు.
ఆమె చేసిన టీవీ కార్యక్రమాలను, అందులోని అసభ్య మాటలను, చేష్టలను ఫొటోలతో సహా పోస్టులు చేశారు. ‘మీరు చేసే టీవీ కార్యక్రమాల్లో అసభ్యత లేకుండా చూసుకోండి’ అంటూ విమర్శలు చేశారు. ఈ ట్రోలింగ్పై వరుస ట్వీట్లలో అనసూయ స్పంది స్తూ…‘నా సోషల్ మీడియా అకౌంట్లో ఇంత చెత్త చేరుతుందని ఊహించలేదు. క్లీన్ చేయలేనంత పేరుకుపోయింది. నేను పిరికిదాన్ని కాదు.
అసలు ఏం జరిగిందో మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు..ఇకపై నన్ను, నా కుటుంబాన్ని కించపరిచే ప్రతి కామెంట్కు రిైప్లె ఇస్తా, స్క్రీన్ షాట్ తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్తా. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మరీ నన్ను ట్రోల్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.