ఎదులాపురం, మే 28 : లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జూన్4న నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించిన సిబ్బందికి ట్రెయినర్ లక్ష్మ ణ్ ద్వారా శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ.. వారం రోజులే ఫలితాలకు సమయం ఉందని, అసెంబ్లీ స్థానాలవారీగా పోలైన ఓట్లు, మొత్తం పోలింగ్ బూత్ల ఆధారంలో లెక్కింపు టేబుళ్లను సిద్ధ చేస్తామని చెప్పారు. 4వ తేదీన ఉద యం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, ఈ వీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, వేరువేరు టేబుల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడికి మధ్యా హ్నం 3 గంటల వరకు సమయం పట్టనుందని, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల పరిశీలకులు, సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వ ర్స్ వీరితోపాటు వివిధ పార్టీల ఎన్నికల ఏజెం ట్లు ఉంటారన్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కిం పు రోజు విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, కౌంటింగ్ ప్రక్రియను పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. శిక్షణలో పూర్తి అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. ఇందు లో సహాయ రిటర్నింగ్ అధికారి ఖుష్భూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ పాల్గొన్నారు.