ఆదిలాబాద్ : ఆదిలాబాద్( Adilabad ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో ( Puddle ) ప్రమాదవశాత్తు పడి అక్క, తమ్ముడు మృతి చెందిన ఘటన శనివారం మావలలో జరిగింది . మావలకు చెందిన స్వామి కొడుకు విధాత ( 9), కూతురు వినూత్న (11) గ్రీన్ సిటీ సమీపంలోని సైకిల్ మీద వెళుతుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. వారి మృతదేహాలను నీటి కుంటలో నుంచి బయటకు తీసి రిమ్స్ మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.