సిటీబ్యూరో : పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఉరేగింపు ఉంది. దీంతో సోమవారం బోనాల జాతరకు సంబంధించిన ర్యాలీ పాతబస్తీలో కొనసాగనుంది.ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఈ ఉత్తర్వులు చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, బహదూర్పుర ప్రాంతాల్లో అమలులో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు చార్మినార్, ఫలక్నుమా, నయాపూల్ వైపు అనుమతించరు, సీబీఎస్, అఫ్జల్గంజ్, దారుల్షిఫా ఎక్స్ రోడ్, ఇంజన్బౌలి రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.
అంబర్పేట్లోని మహంకాళి ఆలయం వద్ద జరిగే బోనాల సందర్భంగా అంబర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సోమవారం మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. ఈ సందర్భంగా వరంగల్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే అంబర్పేట్ వైపు వచ్చే జిల్లా బస్సులను దారి మళ్లిస్తారు. వరంగల్, తదితర ప్రాంతాల వైపు నుంచి ఉప్పల్మీదుగా అంబర్పేట్ వైపునకు వచ్చే వాహనాలు, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, ఫీవర్ ఆసుపత్రి, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డ, చాదర్ఘాట్, సీబీఎస్ వైపు మళ్లిస్తారు. తిరిగి వెళ్లే వాహనాలు కూడా అదే రూట్లో వెళ్లాలి.