న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలైన శాంసంగ్, షియోమీ, రియల్మీ, నోకియా, ఒప్పో తదితర బ్రాండ్లు ఈ ఏప్రిల్లో తమ టాప్ స్మార్ట్ఫోన్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. భారతీయ వినియోగదారుల నుంచి వస్తున్న విశేషాదరణకు అనుగుణంగా హైఎండ్ మోడళ్లతో పాటు తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో సరికొత్త ఫోన్లను ఆవిష్కరించనున్నాయి.అవేంటో ఓసారి చూద్దాం!
చైనా మొబైల్స్ మేకర్ షియోమీ Mi 11 సిరీస్లో ఒకేసారి మూడు మోడళ్లు Mi 11 ఆల్ట్రా, Mi 11 ప్రొ, Mi 11 లైట్ 5Gలను ఏప్రిల్ 23న భారత్లో ఆవిష్కరించనుంది.
సౌత్కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం62 ఫోన్ను ఈ నెలలో విడుదల చేయనుంది. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన బడ్జెట్ ఫోన్ రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనుంది.
రెడ్మీ k40 సిరీస్ను గత ఫిబ్రవరిలో చైనాలో విడుదల చేసిన కంపెనీ ఏప్రిల్లో పొకో బ్రాండ్ పేరుతో స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించనుంది.
స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ C సిరీస్లో మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
రియల్మీ C20, రియల్మీ C21, రియల్మీ C25 స్మార్ట్ఫోన్లను భారత్లో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ F12, F02S పేర్లతో రెండు కొత్త ఫోన్లను ఏప్రిల్ 15న రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. బడ్జెట్ రేంజ్లో అద్భుత ఫీచర్లతో వీటిని తీసుకొస్తున్నది.
పాపులర్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో F19 మిడ్ రేజ్ స్మార్ట్ఫోన్ను ఏప్రిల్ 6న భారత్లో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
ఇన్ఫినిక్స్ బడ్జెట్ విభాగంలో హాట్ 10 ప్లే స్మార్ట్ఫోన్ను ఏప్రిల్ 19న భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ నోకియా ఏప్రిల్లో ఒకేసారి మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేయాలని భావిస్తోంది.