Anupama parameshwaran | త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన’అఆ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరణ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులు చూపు తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత ‘ప్రేమమ్’, ‘శతమానంభవతి’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. ఇక ఇటీవలే ‘కార్తికేయ-2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అనుపమ గత చిత్రాలకు భిన్నంగా వేరియేషన్ చూపించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకుంది. ముగ్ధ పాత్రలో ఒదిగిపోయింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం గత వారం విడుదలై ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అనుపమ మాట్లాడుతూ ‘కార్తికేయ-2 లోని నా పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా చూసిన వారందరూ చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా బావుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది . ఈ సినిమాలో కృష్ణతత్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రం కోసం కొన్ని ప్రాజెక్ట్లను’ వదులుకున్నట్లు’ తెలిపింది. అంతేకాకుండా ‘రౌడీ బాయ్స్’ సినిమాలో ముద్ద సీన్ల గురించి స్పందించి రౌడీ బాయ్స్లో ఎక్కువ గ్లామర్గా ఉండాలని చేసిన పాత్ర కాదు. సిచ్యువేషన్ డిమాండ్ మేరకు ముద్దు సీన్లలో నటించాను’ అంటూ తాజాగా జరిగిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.